మాయావతి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

 

రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న బీఎస్పీ నాయకులు

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 69 వ జన్మదినం సందర్భంగా బీఎస్పీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.పటాన్ చెరు నియోజకవర్గం లోని ప్రభుత్వ ఏరియ ఆసుపత్రిలో పటాన్చెరు నియోజకవర్గం అధ్యక్షులు శ్రీశైలం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు.ఇందుకు సహకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధర, ఆర్ ఎమ్ ఓ డాక్టర్ ప్రవీణ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, తెల్లాపూర్ మునిసిపల్ అధ్యక్షులు దర్శన్, సీనియర్ నాయకులు జనార్దన్, కృష్ణ, రుద్రారం గ్రామం నాయకులు జనార్ధన్,శ్రీనివాస,ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీశైలం మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాలకవర్గాలు కృషి చేయాలన్నారు.70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వివక్ష కొనసాగుతున్నడం అత్యంత విషాదకరమన్నారు.బహుజన సమాజ్ పార్టీని బలపరచడం ద్వారా సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *