అమెరికాలో హత్య గురైన నాచారం యువకుడు

అమెరికాలో చదువుతున్న హైదరాబాద్ చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ అనే యువకుడు మృతదేహం లభ్యమయ్యింది.మార్చి 7న అమెరికాలోని క్లీవ్ల్యాండ్లో అబ్దుల్ మహమ్మద్ కిడ్నాప్ చేసిన డ్రగ్ ముఠా హత్య చేశారు.అబ్దుల్ విడుదల చేయాలంటే 1,200 డాలర్లు ఇవ్వాలని అబ్దుల్ పేరెంట్స్ ను డ్రగ్ ముఠా డిమాండ్ చేశారు.క్లేవ్ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అబ్దుల్ మహ్మద్ మృతి వార్తా సర్వత్రా ఆవేదనకు గురిచేసింది.మార్చి 7 నుంచి అబ్దుల్ మహమ్మద్ ఆచూకీ గల్లంతు కాగా నెల రోజుల తరువాత హత్యకు గురైనట్లు అక్కడ పోలీసులు గుర్తించారు.గడిచిన కొద్దీ రోజులుగా అబ్దుల్ కుటుంబ సభ్యుల ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరగడంతో తల్లడిల్లి పోతున్నారు.అబ్దుల్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన క్లేవ్ల్యాండ్ పోలీస్ రెస్క్యూ టీం ఎట్టకేలకు క్లేవ్ల్యాండ్ లోనీ ఓహిలో అబ్దుల్ మహమ్మద్ మృతదేహం గుర్తించారు. ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరగా అబ్దుల్ మహమ్మద్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నాచారం తరలించేందుకు ఇండియన్ ఎంబసీ & అమెరికా ఏర్పాట్లు చేస్తున్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *